Today History: ఘజియాబాద్లోని ఝండాపూర్ అంబేడ్కర్ పార్క్.. సీపీఐ (ఎం) అభ్యర్థి రామానంద్ ఝాకు మద్ధతుగా ప్రచారం.. జన నాట్య మంచ్ ప్రజలను ఆకర్శించేందుకు ‘హల్లా బోల్’ అనే వీధి నాటకాన్ని ప్రదర్శించడం మొదలెట్టింది. ఇంతలో అటుగా వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ శర్మ తనకు వెళ్లేందుకు దారివ్వాలని అడిగాడు. కొద్దిసేపు వేచి ఉండండి లేదంటే మరో మార్గం గుండా వెళ్లండి అని అక్కడి నటుడు సమాధానమిచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ముఖేశ్ శర్మ అనుచరులు నాటకంలో నటిస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నటుడు సఫ్దర్ హష్మి దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన 1989లో సరిగ్గా ఇదే రోజున జరిగింది. భర్త హష్మీ చనిపోయిన 48 గంటల తర్వాత ఆయన భార్య మాల్యశ్రీ.. ఆయన పాత్రను పోషించి మరీ నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించారు.
సఫ్దర్ హష్మీ చనిపోయే నాటికి ఆయన వయసు కేవలం 34. తక్కువ కాలం పాటు జీవించినప్పటికీ సఫ్దర్ హష్మీ ఎంతో మంది ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1954 ఏప్రిల్ 12 న జన్మించిన సఫ్దర్ హష్మీ.. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎంఏ ఇంగ్లిష్ పట్టా సంపాదించారు. అనంతరం ఇన్ఫర్మేషన్ అధికారిగా ఉద్యోగం సంపాదించి కొన్ని రోజులకే రాజీనామా చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్లో సభ్యత్వం తీసుకున్నాడు. 1973 లో జన నాట్య మంచ్కు హష్మి పునాది వేసి వీధి నాటకాలతో ప్రజల దగ్గరికి చేరగలిగాడు. సఫ్దర్ తన తుదిశ్వాస విడిచే వరకు 24 వీధి నాటకాలను 4000 సార్లు ప్రదర్శించాడు. కార్మికుల నివాసాలు, ఫ్యాక్టరీల వద్ద తమ వీధి నాటకాలు చూపించేవాడు.
2003 లో ఆయన మరణించిన 14 ఏండ్ల తర్వాత.. ఘజియాబాద్ కోర్టు కాంగ్రెస్ నాయకుడు ముఖేశ్ శర్మతో పాటు 10 మందిని దోషులుగా ప్రకటించి జీవిత ఖైదు విధించింది.
2016: సౌదీ అరేబియాలోని షియా మతగురువు నిమ్ర్ అల్-నిమ్ర్, 46 మంది సహచరుల ఉరితీత
1991 : కేరళ తిరువనంతపురం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు
1989: శ్రీలంక మూడో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాణి సింగ్ ప్రేమదాస
1975: పోలీసుల కస్టడీలో దారుణహత్యకు గురైన బంగ్లాదేశ్ విప్లవ నాయకుడు సిరాజ్ సికర్
1959 : చంద్రుడి సమీపంలోకి మానవుడు తయారు చేసిన అంతరిక్ష నౌక లూనా-1 ప్రయోగం
1954: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రారంభం
1942: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాను స్వాధీనం చేసుకున్న జపాన్ దళాలు
1882: ప్రపంచంలో తొలి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లండన్లో ప్రారంభం
1843: ఆస్ట్రియా రాజధాని వియన్నాలో తొలిసారి పోస్టల్ సర్వీసులు ప్రారంభం
1839: చంద్రుడి తొలి ఫొటోను ప్రదర్శించిన ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ లూయిస్ డాగురే
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..