ముంబై: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం తూర్పు ప్రాంతంలో భూగర్భంలో వింత శబ్దాలు వినిపించాయి. బుధవారం ఉదయం వివేకానంద చౌక్ సమీపాన 10.30 గంటల నుంచి 10.45 గంటల మధ్య వినిపించిన శబ్దాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూకంపం వస్తుందనే పుకార్లు వ్యాపించడంతో బెంబేలెత్తిపోయారు.
లాతూర్లో ఎలాంటి ప్రకంపనలు నమోదు కాలేదని జిల్లా విపత్తు నియంత్రణ విభాగం తెలిపింది. లాతూర్లో 1993లో సంభవించిన భూకంపంతో 10 వేల మంది మృత్యువాతపడ్డారు.