న్యూఢిల్లీ : ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైళ్లపై రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ – గయ రైల్వే సెక్షన్లోని కర్వాండియా రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది.
బనారస్ నుంచి రాంచీ వెళ్తుండగా, ససారం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఓ రాయి సీ7 బోగీ కిటికీకి బలంగా తగలడంతో అద్దాలు పగిలిపోయాయి. భారీ శబ్దం వినిపించడంతో ఓ ప్రయాణికుడు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ససారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.