న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఇటీవల నియమితులైన బోధన, బోధనేతర ఊరట లభించింది. వారి నియామకం చెల్లదంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అయితే ఈ కేసు దర్యాప్తును కొనసాగించడానికి సీబీఐకి అనుమతి ఇవ్వడమే కాక, దర్యాప్తుకు అవసరమైతే రాష్ట్ర మంత్రివర్గ సభ్యులను కూడా విచారించవచ్చునంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్లు జేబీ పార్ధీవాల, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు దర్యాప్తులో భాగంగా అధికారులు, ఉద్యోగాలు పొందినవారిని, అనుమానితులను అరెస్ట్ చేయవద్దంటూ సీబీఐని ఆదేశించింది.