చెన్నై, సెప్టెంబర్ 19: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయడం తగదని, ఈ కోటా పరిమాణంపై నిర్ణయం తీసుకునే హక్కును ఆయా రాష్ర్టాలకే దఖలు పరచాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ జస్టిస్ సమావేశంలో వర్చువల్గా మాట్లాడుతూ.. ఉదాహరణకు తమిళనాడునే తీసుకుంటే ఇక్కడ 69 శాతం రిజర్వేషన్లు అవసరమని, అయితే దీనిని 50 శాతానికే పరిమితం చేశారన్నారు.
మొత్తం రాష్ట్ర జనాభా, రిజర్వేషన్ అవసరమైన వర్గాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ర్టాలే రిజర్వేషన్ కోటాను నిర్ణయించే హక్కు కల్పించాలని ఆయన కోరారు. రిజర్వేషన్ విధానంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాన్ని అవలంబిస్తున్నదని ఆయన ఆరోపించారు.