Loksabha Elections 2024 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తమ కూటమి లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 40 లోక్సభ నియోజకవర్గాల్లో స్టాలిన్ తమ అభ్యర్ధిగా భావించి పార్టీ శ్రేణులు లోక్సభ ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీని మట్టికరిపించేందుకు విపక్ష ఇండియా కూటమి లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.
బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, సీట్ల సర్దుబాటు వివిధ రాష్ట్రాల్లో తుది దశకు చేరుకుందని స్టాలిన్ వివరించారు. ఇక తమిళనాడులో పాలక డీఎంకే విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలో సీట్ల సర్ధుబాటును ఖరారు చేసింది. కాంగ్రెస్ 9 స్ధానాల్లో పోటీ చేనుండగా, పాలక డీఎంకే 21 స్ధానాల్లో బరిలో నిలవనుంది.
ఎండీఎంఎకే, ఐయూఎంఎల్, కేఎండీకే ఒక్కో స్ధానంలో పోటీ చేయనుండగా, వీసీకే, సీపీఎం, సీపీఐకి రెండేసి లోక్సభ స్ధానాలను కేటాయించారు. పుదుచ్చేరిలోని ఒక లోక్సభ స్ధానం నుంచి కాంగ్రెస్ బరిలో నిలుస్తుంది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి 38 స్ధానాలను గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ తాను పోటీ చేసిన 9 స్ధానాల్లో ఏకంగా 8 స్ధానాల్లో విజయం సాధించింది.
Read More :