Shivraj Singh chouhan | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి (Madhya Pradesh Chief Minister ) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh chouhan) నిర్వహించిన రోడ్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. వేదిక కూలడంతో పలువురు గాయపడ్డారు. రాష్ట్రంలోని నీముచ్ జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
మానస పట్టణం (Manasa town)లో సోమవారం సీఎం రోడ్ షో (roadshow) నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ప్రజలు రోడ్ షోకు తరలివచ్చారు. కొందరు అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నిలబడని సీఎంకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని అధికారులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
Uttarakhand | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
Ambareesh Murty | పెప్పర్ ఫ్రై సీఈవో అంబరీష్ మూర్తి మృతి
Sherlyn Chopra | రాహుల్ గాంధీతో పెళ్లికి ఓకే.. అయితే ఓ షరతు : షెర్లిన్ చోప్రా