పండుగ పూట విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లో రైతుల పైకి కారు దూసుకెళ్లిన ఘటన మరవకముందే ఛత్తీస్గఢ్లో అలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. నవరాత్రుల ముగింపు సందర్భంగా జష్పూర్లో దుర్గమ్మ విగ్రహ నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపై నుంచి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రోక్తులైన అక్కడి ప్రజలు.. కారును తగులబెట్టారు. అయితే.. కారులో పెద్ద మొత్తంలో గంజాయి ఉందని.. పోలీసులు చెక్ చేయడంతో వారి నుంచి తప్పించుకుని వేగంగా వెళ్లే క్రమంలో భక్తులపైకి కారు దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.