న్యూఢిల్లీ: సుదీర్ఘ ప్రయాణాల్లో మహిళలకు అసౌకర్యం కలుగకుండా రైల్వేశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాసులోని ఆరు బెర్తులను (రిజర్వేషన్ కోటా) మహిళలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. గరీబ్థ్/్రరాజధాని/దురంతో రైళ్లలో 3ఏ, పూర్తి ఏసీ రైళ్లలో కూడా ఆరు బెర్తులను (రిజర్వేషన్ కోటా) మహిళలకు కేటాయిస్తున్నట్టు వివరించింది.