న్యూఢిల్లీ: తెలంగాణ మూలాలున్న భారతీయ-అమెరికన్ వ్యోమగామి రాజాచారి అరుదైన ఘతన సాధించారు. స్పేస్వాక్(అంతరిక్షంలో నడక) చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి ఫ్లైట్ ఇంజినీర్ కైలా బారన్తో కలిసి బయటకు వచ్చిన ఆయన దాదాపు ఆరున్నర గంటల సేపు రోదసిలోని శూన్యంలో సంచరించారు. వీరిద్దరు క్వెస్ట్ నుంచి స్టార్బోర్డ్-4 ట్రస్ వద్దకు చేరుకొని అక్కడ ఇప్పటికే ఉన్న సోలార్ ప్యానెళ్ల స్థానంలో కొత్తవాటిని అమర్చారు.