SKYROOT| బెంగళూరు: హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ శుక్రవారం తమ రాకెట్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ)లో ఈ పరీక్ష నిర్వహించారు. రామన్-2 రాకెట్కు సంబంధించి 10 సెకండ్ల పాటు నిర్వహించిన ఈ పరీక్ష.. అనుకున్న లక్ష్యాలను సాధించిందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. దేశ అంతరిక్ష రంగాన్నిమరింత ముందుకు తీసుకెళ్లడంతో భాగంగా ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్లకు సహకారం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నది.
తమ వ్యోమనౌక విక్రమ్-1 నాలుగో దశలో ఈ ఇంజిన్ను ఇంటిగ్రేట్ చేయాలని స్కైరూట్ భావిస్తున్నది. రామన్-2 ఇంజిన్ సామర్థ్యాన్ని తదుపరి అంచనా వేయడానికి మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ లాంచింగ్ కంపెనీ అయిన స్కైరూట్ను ఇస్రోకు చెందిన మాజీ శాస్త్రవేత్తలు స్థాపించారు.