లక్నో : ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. నిఘోహీ పోలీసు స్టేషన్ పరిధిలోని విక్రమ్పూర్ చకోరా గ్రామంలో సమాజ్వాదీ పార్టీ నాయకుడిని హత్య చేశారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని సమాజ్వాదీ పార్టీకి చెందిన బూత్ ప్రెసిడెంట్ సుధీర్ కుమార్గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వ్యక్తి సునీల్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సుధీర్పై కాల్పులు జరిపిన వారిని అంతు, సర్వేష్గా పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ రెండు వర్గాల మధ్య ఓటర్ల విషయంలో సోమవారం గొడవ తలెత్తింది. పోలింగ్ సమయంలో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఒకరికొకరు ఆరోపించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.