Lok Sabha Polls : రానున్న లోక్సభ ఎన్నికలకు 11 మంది అభ్యర్ధులతో కూడిన మరో జాబితాను సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) సోమవారం విడుదల చేసింది. రాజకీయ నేతగా మారిన గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీని ఘాజీపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ బరిలో నిలిపింది. ముజఫర్నగర్ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ఇక రమేష్ గౌతం, వీరేంద్ర సింగ్ బహ్రెచ్, చందౌలి నుంచి ఎస్పీ అభ్యర్ధులుగా తలపడనున్నారు. ఇక అన్లా నుంచి నీరజ్ మౌర్య, మర్ధోయ్ నుంచి ఉషా వర్మ, మిస్రిక్ నుంచి రాంపాల్ రాజ్వంశీ, మోహన్లాల్ గంజ్ నుంచి ఆర్ చౌధురి, ప్రతాప్ఘఢ్ నుంచి ఎస్పీ సింగ్ పటేల్, గొండా నుంచి శ్రేయ వర్మలకు ఈ జాబితాలో ఎస్పీ చోటు కల్పించింది.
కాగా, జనవరి 30న 16 మంది అభ్యర్ధులతో ఎస్పీ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ను మొయిన్పురి నుంచి, షఫీకుర్ రెహ్మీన్ను సంభాల్ నుంచి లక్నో నుంచి రవిదాస్ మెహోత్రను ఎస్పీ లోక్సభ ఎన్నికల బరిలో దింపింది.
Read More :