లక్నో, జనవరి 26: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు కేంద్రం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మరణానంతరం ఈ అవార్డు ఇవ్వడం ద్వారా ములాయం స్థాయిని, కృషిని, జాతికి చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేసింది. వాళ్లు నేతాజీని గౌరవించాలని అనుకొని ఉంటే భారతరత్న ఇవ్వాల్సింది’ అని ఆ పార్టీ ఎమ్మెల్యే స్వామి ప్రసాద్ మౌర్య ట్వీట్ చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఐపీ సింగ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఆలస్యం చేయకుండా ములాయంకు భారతరత్న ఇవ్వాలని కోరారు.