లక్నో : యూపీలోని మొయిన్పురి లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్లో కాషాయ పార్టీ అక్రమాలపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) విరుచుకుపడింది. 1945 పోలింగ్ కేంద్రాల్లోని 3062 పోలింగ్ బూత్ల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలీసులు బీజేపీ ఏజెంట్లలా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీ ఆరోపించింది.
తమ పార్టీ కార్యకర్తలను పోలింగ్ బూత్ల నుంచి తరిమివేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయడం లేదని, పోలింగ్ శాతం తగ్గించేందుకు ఓటర్లను ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. కర్హాల్లోని బల్పూర గ్రామంలో ముస్లిం ఓటర్లను ఓటు వేయకుండా బీజేపీ నేతలు నిలువరిస్తున్నారని ఎస్పీ ఆరోపించింది. బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్న రాకేష్ కుమార్ సింగ్ను సస్పెండ్ చేయాలని పట్టుబట్టింది.
भोगांव विधानसभा के मोहल्ला पथरिया में बूथ संख्या 250 पर भारतीय जनता पार्टी के एजेंट द्वारा पैसे बांटे जा रहे हैं।
मामले का संज्ञान लेकर तत्काल कार्रवाई करे चुनाव आयोग।@ceoup@ECISVEEP @SpokespersonECI pic.twitter.com/tGn7h7omxe
— Samajwadi Party (@samajwadiparty) December 5, 2022
భోగాన్లో ముస్లిం ఓటర్లను ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కర్హాల్లో పోలింగ్ శాతం తగ్గించేందుకు కేంద్ర భద్రతా దళాలు ఐడీ కార్డుల తనిఖీల పేరుతో ఓటర్లను వేధిస్తున్నాయని పేర్కొంది. భోగాన్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఎస్పీ ఓ వీడియోను ట్వీట్ చేసింది. రాంపూర్లో తమ పార్టీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ఎస్పీ ఆరోపించింది.