లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనానికి సమాజ్వాదీ పార్టీ బ్రేక్ వేస్తోంది. గంటగంటకూ ఆధిక్యాలు మారుతుండటంతో అంకెలు తారుమారవుతున్నాయి. ఓ దశలో 115 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎస్పీ తాజాగా 137 స్ధానాల్లో ఆధిక్యంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఇక బీజేపీ ఆధిక్యత 283 నుంచి 261 స్ధానాలకు తగ్గింది. దాదాపు వంద స్ధానాల్లో బీజేపీ, ఎస్పీల మధ్య 500లోపు మెజారిటీ ఉండటంతో విజయంపై ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. యూపీలో మొత్తం 36 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడుతుండగా ప్రస్తుతం 23వ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.
ఇక బీజేపీ 261 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎస్పీ 137 స్ధానాల్లో, బీఎస్పీ 2 స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ కేవలం ఒక స్ధానంలో ముందుండగా ఇతరులు రెండు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.