న్యూఢిల్లీ: కేరళ (Kerala) తీరాన్ని నైరుతి ముందుగానే పలకరించింది. సాధారణంకంటే మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది (IMD). సాధారణంగా జూన్ 1న కేరళకు చేరుకుంటాయని వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని.. మే 27 నాటికి కేళర తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది.
Southwest Monsoon has set in over Kerala today, the 29th May , 2022 pic.twitter.com/H3mOkJB54s
— India Meteorological Department (@Indiametdept) May 29, 2022
అయితే చెప్పిన సమయానికి నాలుగు రోజులు తేడా ఉంటే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని గతంలో వెల్లడించింది. కాగా, సాధారణం కంటే చాలా ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకాయని మృత్యుంజయ్ తెలిపారు. భారతీయ వ్యవసాయ ఆధారిత ఆర్థిక రంగానికి నైరుతి రుతుపవనాలు ప్రధాన ఆధారంగా నిలుస్తాయి.