Delhi School | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఓ ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. సౌత్ ఢిల్లీ (South Delhi)లోని పుష్పవిహార్ (Pushp Vihar ) ప్రాంతంలోగల అమృత పాఠశాలకు (Amrita School) మంగళవారం ఉదయం 6:33 గంటల ప్రాంతంలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి తరలించారు. పోలీసులు (Police), బాంబు స్వ్కాడ్ ( bomb squad) పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
కాగా, ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు పలు పాఠశాలలకు ఫోన్కాల్స్, ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా మధుర రోడ్ (Mathura Road)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతకుముందు సాదిఖ్ నగర్ (Sadiq Nagar)లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ (Indian Public School) ప్రాంగణంలో బాంబులు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరించారు.
Also Read..
Amazon Layoffs | అమెజాన్లో 9 వేల మందిపై వేటు.. భారత్లో 500 మందిపై లేఆఫ్స్ ప్రభావం
Girls Molested: 18 మంది మైనర్ అమ్మాయిలను వేధించిన యూపీ టీచర్
Pak | కోల్మైన్ డీలిమిటేషన్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. 15 మంది దుర్మరణం..!