షాహజహాన్పూర్: యూపీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ను అరెస్టు చేశారు. 18 మంది అమ్మాయిలతో ఆ టీచర్ అసహ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తేల్చారు. అమ్మాయిలను వేధించిన కేసులో కంప్యూటచర్ టీచర్కు మద్దతు ఇచ్చిన ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ను సస్పెండ్ చేశారు. ముగ్గురిపైనా ఎస్సీ, ఎస్టీ యాక్ట్, ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. యూపీలోని షాహజహాన్పూర్ జిల్లాలో ఉన్న ఓ స్కూల్లో ఈ ఘటన జరిగింది.
మైనర్ అమ్మాయిలను లైంగికంగా వేధించిన ఘటనలో తిల్హార్ పోలీసు స్టేషన్లో కేసును నమోలు చేశారు. 18 మంది మైనర్ బాలికలకు ఇవాళ ఎక్స్రే పరీక్షలు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. స్కూల్లో చదువుతున్న మైనర్ అమ్మాయిలను కంప్యూటర్ టీచర్ మహమ్మద్ అలీ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అతనికి ప్రిన్సిపాల్ అనిల్ పాఠక్, మరో టీచర్ సాజియా మద్దతు ఇచ్చినట్లు సర్కిల్ ఆఫీసర్ ప్రియాంకా జైన్ తెలిపారు.