ముంబై: కరోనా సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ అందరినీ వణికిస్తున్నది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు (Thane) వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిని ఐసోలేషన్లో ఉంచారు. థానే జిల్లాలోని దొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 24న దక్షిణాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అటునుంచి ముంబైకి చేరుకున్నాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించామని వైద్యులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశామని.. సోదరునికి మినహా మిగిలిన అందరికీ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్లో ఉన్నారన్నారు.
ఆదివారం దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కూడా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది ఒమిక్రాన్ కాదని, డెల్టా స్ట్రెయిన్ అని పరీక్షల్లో నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు.