హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికాలో జరిగే ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్నకు ఎంపికైన తెలంగాణ వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. 35 కిలోమీటర్ల దూరంతో 15డిగ్రీల సెల్సియస్ కల్గిన వాటర్లో స్విమ్మింగ్ రేసులో రాణించాలని శ్యామలకు మంత్రి సూచించారు. భవిష్యత్లోనూ స్విమ్మింగ్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. అయితే తనకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని శ్యామల కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టిని మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఒలింపిక్స్లో పతకాలు సాధించి దేశానికి, రాష్ర్టానికి మరింత గుర్తింపు తీసుకురావాలని అన్నారు.