న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ.. హైదరాబాద్కు బయలుదేరారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్కు వాళ్లు చేరుకున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలను రిసీవ్ చేసుకునేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్ వెళ్లినట్లు సమాచారం. మరో వైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజనర్సింహా, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ థాక్రే ఫోన్ చేశారు.ఒక్కరికే ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
#WATCH | Congress leaders Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi Vadra and Deepender S Hooda at Delhi airport, on their way to Hyderabad to attend the oath-taking ceremony of Revanth Reddy as Telangana CM
(Video source: Deepender S Hooda) pic.twitter.com/x2X3dGWqru
— ANI (@ANI) December 7, 2023