మాండ్య: ప్రస్తుతం కర్నాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాహుల్తో కలిసి సోనియా గాంధీ (Sonia Gandhi)కూడా యాత్రలో నడిచారు. మాండ్య జిల్లాలో జరిగిన యాత్రలో ఆమె కొద్దిసేపు యాత్రలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు కూడా సోనియాతో కలిసి ఉత్సాహంగా నడిచారు. యాత్రలో భాగంగా వాకింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ తన తల్లి సోనియా షూకు లేస్ కట్టారు.
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇవాళ బల్లారీలో జరిగే బహిరంగసభలో సోనియా మాట్లాడనున్నారు. బుధవారం రోజున ఆమె బేగుర్ గ్రామంలో ఆలయాన్ని విజిట్ చేసి అక్కడ పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ ఏడో తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.
సోమవారం ఉదయమే సోనియా గాంధీ మైసూరు చేరుకున్నారు. ఆయుధ పూజ, విజయదశమి నేపథ్యంలో రెండు రోజుల పాటు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. సోనియా గాంధీ యాత్రలో పాల్గొనడం గర్వంగా ఉందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు.