అయోధ్య: అయోధ్యలో రామ మందిర ప్రాంగణంలో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయని, పూర్ణ స్మృతి స్తంభంపైన ట్రస్టుకు చెందిన చిహ్నం(లోగో) ప్రతిష్ఠించడం మిగిలి ఉందని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారం తెలిపారు. నిర్మాణంతో సంబంధం ఉన్న ఏజెన్సీల ప్రతినిధులతో మూడు రోజుల సమావేశంలో పాల్గొనేందుకు అయోధ్యకు వచ్చిన మిశ్రా విలేకరులతో మాట్లాడుతూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన కాంస్య చిహ్నాన్ని ప్రతిష్ఠించడానికి అనుమతి లభించినట్లు చెప్పారు. ఈ పని కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో మ్యూజియం నిర్వహణ, అభివృద్ధి గురించి సమీక్షించనున్నామని ఆయన చెప్పారు.