Sonia Gandhi | ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ మంగళవారం రాజస్థాన్ రాజధాని జైపూర్కు చేరుకున్నారు. వైద్యుల సలహా మేరకే ఆమె ఢిల్లీ నుంచి జైపూర్ కు వచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో కలిసి ఆమె జైపూర్ చేరుకున్నారు. ఢిల్లీలో వాతావరణం సరిగ్గా లేదని, అందువల్లే వ్యక్తిగత కారణాల రీత్యా జైపూర్కు వచ్చారే గానీ రాజకీయ కోణం లేదన్నారు.
ఢిల్లీలో విషపూరితమైన గాలితో సోనియాగాంధీకి ముప్పు ఉంటుందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. గత సెప్టెంబర్ నెలలో జ్వరం కారణంగా ఢిల్లీలో సర్ గంగారామ్ హాస్పిటల్లో చేరారు. శ్వాస కోశ సంబంధ సమస్యలతో గత జనవరిలోనూ దవాఖానలో చేరారు. అంతకుముందు 2020లో డాక్టర్ల సలహా మేరకే గోవాకు వెళ్లారు.