న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఆవరణలో ఆ పార్టీ నేత సోనియా గాంధీ నేతృత్వంలో ఎంపీలు నిరసన చేపట్టారు. నల్ల సాగు చట్టాలను రద్దు చేయాలంటూ భారీ బ్యానర్తో పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.