జైపుర్, జూలై 15: రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్సింగ్ దోతాస్ర సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు బీజేపీ, ఆరెస్సెస్తో అంటకాగుతున్నారని గోవింద్సింగ్ తెలిపారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం గోవింద్సింగ్ మాట్లాడారు.
బీజేపీ నాయకులు, ఆ పార్టీ ఎమ్మెల్యేల కోరిక మేరకు రాష్ట్రంలోని అధికారులను బదిలీ చేస్తున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విన్నపాలను తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు.