న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంటలు కోసిన తర్వాత రైతులు తమ పంటపొలాల్లోని కొయ్యకాలు (వరి కొయ్యలను) తగులబెడుతున్నారు (Stubble burning). ఇది దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలకు శాపంగా మారింది. ఈ స్టబుల్ బర్నింగ్ కారణంగా వెలువడే పొగ ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యాన్ని మరింత తీవ్రం చేస్తున్నది. ఢిల్లీ వాసులు శ్వాస సంబంధ అనారోగ్యాల బారిన పడుతున్నారు.
దాంతో పంజాబ్లో కూడా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రంలో పంట వ్యర్థాల (కొయ్యకాలు)ను తగులబెట్టకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బఠిండాలోని మొహమా సర్జా గ్రామంలో కొందరు రైతులు తమ పంట వ్యర్థాలకు నిప్పు పెడుతుండగా హర్ప్రీత్ సింగ్ అనే అధికారి అడ్డుకున్నాడు. దాంతో రైతులు అధికారిపై తిరగబడ్డారు. రైతు సంఘాల నేతలు సైతం అక్కడికి చేరుకుని సదరు అధికారి చేతిని కొయ్యకాలుకు నిప్పుపెట్టించారు.
పంట వ్యర్థాలను కాల్చివేయవద్దని అడ్డుకునేందుకు వచ్చిన అధికారితోనే రైతులు బలవంతంగా పంట వ్యర్థాలను తగులబెట్టించడంపై సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. ఈ వీడియోను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎక్స్లో షేర్ చేశారు. కాగా, ఘటనకు బాధ్యులైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Are they Farmers or goons????? punjab government officer who came to stop farmers from burning stubble in Burj Mehma of Bathinda, Punjab was harassed and forced to burn stubble. @ArvindKejriwal @BhagwantMann @narendramodi @AmitShah @myogiadityanath @nitin_gadkari @CPCB_OFFICIAL pic.twitter.com/vDtslrLZQS
— Ammy Bhardwaj (@AmmyBhardwaj1) November 4, 2023