Dharmanna Sadul | హైదరాబాద్ : మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ధర్మన్న మోందయ్య సాదుల్ బుధవారం మరణించారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్రావు సంతాపం ప్రకటించారు. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ధర్మన్న రెండు సార్లు ఎంపీగా పని చేశారు. సోలాపూర్ మేయర్గా కూడా సేవలందించారు. బీఆర్ఎస్ పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తుండిపోతాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కరీంనగర్ మూలాలు కలిగిన ఆయన సోలాపూర్లో తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నారు. అక్కడి సామాజిక, రాజకీయ సమస్యల పట్ల పోరాటం చేసి విజయాలు సాధించారు. తెలంగాణ నుండి వలస వెళ్లిన చేనేత కార్మికులతో పాటు, స్థానిక కార్మికులకు అండగా నిలిచారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా, అత్యంత నిరాడంబరంగా గడిపిన ఆయన జీవితం అందరికీ ఆదర్శం అని హరీశ్రావు పేర్కొన్నారు.
బిఆర్ఎస్ నేత, సోలాపూర్ మాజీ మేయర్, రెండు సార్లు ఎంపిగా సేవలు అందించిన ధర్మన్న సాదుల్ గారి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ధర్మన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కరీంనగర్ మూలాలు కలిగిన ఆయన సోలాపూర్ లో తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నారు. అక్కడి… https://t.co/8PvvY5I4Ao
— Harish Rao Thanneeru (@BRSHarish) December 13, 2023