ఒకవైపు భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు హిమాచల్ప్రదేశ్లో మంచు కురుస్తున్నది. రోహ్తంగ్ పాస్ పొడవునా మూడు అడుగుల మంచు దుప్పటి పరుచుకుంది. ఇక అటల్ టన్నెల్కు ఇరువైపులా మూడు నుంచి ఐదు అంగుళాల మందంతో మంచు పేరుకుపోయింది. తత్ఫలితంగా ముందు జాగ్రత్త చర్యగా శనివారం నుంచే అధికారులు ఈ రూట్లో టూరిస్టుల రాకపోకలను నిలిపేశారు. ఆదివారం కూడా భారీగా పొగమంచు కురిసింది.
శిస్సు పరిధిలో మూడు నుంచి నాలుగు అంగుళాలు, కెయ్లాంగ్ జిల్లా కేంద్రం తాండిలో రెండు అంగుళాల పొగమంచు కురిసింది. ఉదయ్పూర్ రీజియన్ అంతటా పొగ మంచు కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జారుడుబండల్లా మారాయి. తత్ఫలితంగా కేయ్లాంగ్లోని మనాలీ-లేహ్ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపేశారు.
కుజుం పాస్తోపాటు లొసార్, కాజా ప్రాంతాల్లోనూ భారీగా పొగమంచు కురుస్తున్నది. ఈ నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పర్వత సానువుల వైపు వెళ్లొద్దని స్థానికులు, పర్యాటకులను కుల్లు డిప్యూటీ కమిషనర్ అశుతోశ్ గార్గ్ అభ్యర్థించారు.
కుల్లు-చాంబ, లాహౌల్-స్పిటి మార్గాల్లోనూ భారీగా పొంగ మంచు కురుస్తోంది. కుల్లు, చంద్రఖని తిబ్బ, భ్రిగు తంగ్, అంజనీ మహదేవ్, ఇంద్రా ఫోర్ట్, రుద్రనాగ్, ఖీర్ గంగ, జలోడీ పాస్, శ్రౌల్సార్, వాస్లెట్ జోట్ ప్రాంతాల పర్వత ప్రాంతాల్లో పొగ మంచు కురవడంతోపాటు చలి కూడా పెరిగింది. మరోవైపు దిగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
United Nations : చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
Honeytrap : హనీట్రాప్లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
Congress New Rules : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ