న్యూఢిల్లీ, మార్చి 19: దేశవ్యాప్తంగా 2022లో అక్రమంగా తరలిస్తున్న 3,502 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇది 2021 కంటే 47 శాతం ఎక్కువ అని తెలిపింది. అత్యధికంగా కేరళలో 755.81 కిలోల బంగారం సీజ్ చేసినట్టు పేర్కొంది. ఆ తర్వాత మహారాష్ట్ర(535.65 కిలోలు), తమిళనాడు(519 కిలోలు) ఉన్నాయి. 2020లో 2,154.58 కిలోలు, 2021లో 2,383.38 బంగారాన్ని సీజ్ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2023లో మొదటి రెండు నెలల్లోనే 916.37 కిలోల అక్రమ బంగారాన్ని సీజ్ చేసినట్టు తెలిపింది.