కోల్కతా : దేశీ జలాల్లో హిల్సా చేపలు కనుమరుగవుతుండటంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న హిల్సా ఫిష్ బెంగాల్ రాజధాని కోల్కతాలో మత్స్యప్రియులను అలరిస్తోంది. కిలో రూ 3000కు పైగా పలుకుతున్న స్మగుల్డ్ హిల్సా చేపను జనాలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. కోల్కతా వాసులు హిల్సా చేపను అమితంగా ఇష్టపడుతుంటారు. నగర ప్రజల్లో హిల్సా ప్రముఖ డిష్గా పేరొందింది. హిల్సా కోసం పలువురు తమ నెలవారీ ఖర్చులను సైతం తగ్గించుకుని దీన్ని తినేందుకు మొగ్గుచూపుతున్నారు.
రెండు కిలోలు అంతకంటే ఎక్కువ బరువున్న హిల్సా చేపను కొనేందుకు కొనుగోలుదారులు ఎంత ఖర్చయినా వెచ్చించేందుకు సిద్దపడుతున్నారని లేక్ మార్కెట్లో చేపల విక్రయదారులు పేర్కొంటున్నారు. రెండు కిలోల బరువు తూగే హిల్సాఫిష్ రూ 6000కు పైగా దర పలుకుతోంది. కిలోన్నర బరువుండే హిల్సాను రుచిచూసేందుకు తాను ఎక్కువ ఖర్చు పెట్టేందుకు వెనుకాడనని కాళీఘాట్కు చెందిన టీచర్ సునిర్మల్ అదికారి చెబుతున్నారు.
ఆపై ఖర్చు తగ్గించుకునేందుకు నెలంతా తాను కేవలం గుడ్లు, కూరగాయలతో సరిపెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు. అంగ్రాయ్, హకీంపూర్ నదీతీరం గుండా బంగ్లాదేశ్ నుంచి హిల్సా చేపలు స్మగ్లింగ్ సాగుతోందని చేపల విక్రయదారులు చెబుతున్నారు. ఉత్తర బెంగాల్లోని కొండ ప్రాంత సరిహద్దుల నుంచి కూడా హిల్సా చేపను బెంగాల్కు చేరవేస్తున్నారని తెలిపారు.