న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి (Pit Bull Attack) చేసింది. ఆ పిల్లాడిని దానిని తప్పించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. అతని చెవి తెగిపోయేదాక అది వదల్లేదు. ఆదివారం సాయంత్రం 5.38 గంటల సమయంలో ప్రేమ్నగర్ ప్రాంతంలోని విజయ్ ఎన్క్లేవ్లోని తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో రాజేశ్ పాల్(50) అనే టైలర్కు చెందిన పిట్బుల్ (Pit Bull) జాతి కుక్క అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడే అక్కడున్న బాలుడిపై దాడి చేయబోయింది. పిల్లవాడు దాని బారి నుంచి తప్పించుకుని పరుగుతీస్తుండగా వెంటాడిన కుక్క అతనిపై ఎగబడింది. ఓ మహిళ దానిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది ఆగలేదు. అక్కడే ఉన్న మరో వ్యక్తి దానిని గమనించిన ఆ బాలుణ్ని రక్షించబోయారు. అయినప్పటికీ బాలుడిని వదలని శునకం.. అతని కుడి చెవి తెగిపోయేలా కరిచింది.

కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుణ్ని వెంటనే స్థానికంగా ఉన్న రోహిణిలోని బీఎస్ఏ హాస్పిటల్కి, అక్కడి నుంచి సఫ్దార్జంగ్ దవాఖానకు తరలించారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. కాగా, బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కుక్క యజమాని రాజేశ్పాల్పై భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసుపెట్టిన పోలీసులు.. హత్యాయత్నం కింద అతడిని అరెస్టు చేశారు. రాజేశ్ పాల్ కుమారుడు సచిన్ పాల్.. సుమారు ఏడాదిన్నర క్రితం ఆ శునకాన్ని పెంచుకునేందుకు ఇంటికి తెచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అతడు ఓ హత్యా నేరంపై జైలులో ఉన్నాడు. కాగా, కుక్క తన యజమాని చేతి నుంచి విడిపించుకుని ఈ దారుణానికి పాల్పడిందని బాలుడి తాత కామేశ్వర్ రాయ్ చెప్పారు. అతని తల వెనుక భాగంలో ఎనిమిది నుంచి పది కుక్కకాట్లు పడ్డాయన్నారు.
Pitbull attacks 6-year-old in Delhi’s Prem Nagar, bites off the child’s ear. The owner of the dog has been arrested.
The incident took place on Sunday evening, when the child was playing outside his house. pic.twitter.com/jl1LKmndY8
— Vani Mehrotra (@vani_mehrotra) November 24, 2025