మన ఇండియాలో టూ వీలర్పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అప్పుడప్పుడూ కొందరు రూల్స్ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు మాత్రమే నలుగురు వెళ్లడం చూస్తుంటాం. కానీ ముంబైలో ఓ స్కూటర్పై ఏకంగా ఆరుగురు ప్రయాణించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అంధేరీ వెస్ట్లోని స్టార్ బజార్ సమీపంలో ఆరుగురు ఒకే హోండా యాక్టివాపై వెళ్తూ కనిపించారు. నల్ల కుర్తా ధరించిన ఓ బాలుడు వెనుకనున్న బాలుడి భుజాలపై కూర్చున్నాడు. వెనుక కారులో ప్రయాణిస్తున్న రమణదీప్సింగ్ హోరా అనే వ్యక్తి వారిని ఫొటో తీశాడు. అనంతరం ఈ ఫొటోను ట్విట్టర్ పెట్టి, ముంబై ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటివారిని వదిలిపెట్టకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Heights of Fukra Panti 6 people on one scooter @CPMumbaiPolice @MTPHereToHelp pic.twitter.com/ovy6NlXw7l
— Ramandeep Singh Hora (@HoraRamandeep) May 22, 2022