న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), ఎన్నికల సంఘం వివక్షాపూరిత వైఖరిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్కు 23 ప్రతిపక్ష పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ ఉమ్మడి లేఖ రాశారు. ఇందులో ఇటీవల ఇండియా కూటమితో విభేదించిన డీఎంకే, ఆప్ కూడా భాగస్వాములయ్యాయి. ఈ లేఖను బహిర్గత పర్చకున్నా.. దీనిపై 23 విపక్షాలు, ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్ సంతకం చేసిన విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ నిర్ధారించారు.
ఈ నాలుగు పేజీల లేఖ న్యాయవ్యవస్థ అంతరాత్మకు విజ్ఞప్తి చేస్తూ సాగింది. ఎందుకంటే ఇతర మార్గాలన్నీ విఫలమైనప్పుడు భారత ప్రజాస్వామ్యం న్యాయవ్యవస్థ వైపే చూస్తుంది. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి, ఎన్నికల ఫలితాల తారుమారు అంశాలను ఎత్తి చూపడంతో పాటు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ర్టాల్లో ఎన్నికల యంత్రాంగం, సర్లను వినియోగించిన ఘటనలను కూడా ఈ లేఖలో ఉదాహరణగా పొందుపరిచినట్టు ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. ఈ లేఖపై డీఎంకే, ఆప్లు సంతకాలు చేయడం ఇండియా కూటమికి బలాన్ని ఇచ్చినట్టయ్యింది.