Viral Video : నగరాలు, వివిద ప్రాంతాల్లో ప్రత్యేక కుడ్య చిత్రాలు, ఆర్ట్ వర్క్స్ పలువురిని ఆకట్టుకుంటాయి. తాజాగా తమిళనాడులో సింగపూర్కు చెందిన ఆర్టిస్ట్ కుడ్య చిత్రాలు సోషల్ మీడియా యూజర్ల దృష్టిని ఆకర్షించాయి. విజువల్ ఆర్టిస్ట్ ఇప్ యూ చోంగ్ ఉక్కడంలో స్ధానిక తమిళనాడు ఆహార పదార్ధాలతో కూడిన నాలుగు అంతస్తులపై భారీ కుడ్య చిత్రం అమర్చాడు. రండి..కలిసి తిందాం అని టైటిల్ ఇచ్చారు.ఈ పెయింట్ కోసం చోంగ్ గత నెలలో 9 రోజుల పాటు కష్టపడ్డాడు. తన డిజైన్లకు స్ఫూర్తి ఎలా రేకెత్తిందనే వివరాలను అతడు వెల్లడించాడు.
అరటి ఆకులో ప్రజలు స్ధానిక వంటకాలను ఆరగించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డు పక్కన స్టాల్ వద్ద ఓ వ్యక్తి తాజా, క్రిస్పీ దోశలను తయారుచేయడం కూడా వీడియోలో చూడొచ్చు. కుడ్య చిత్రం ఫొటోలు, ఆర్టిస్ట్ పనిలో ఉండగా బిహైండ్ ద సీన్స్ షాట్స్ కూడా ఈ వీడియోలో కనిపిస్తాయి. స్ధానికుల కోసం ఇక్కడి సంస్కృతి, ఫుడ్ కల్చర్పై తాను మనసు పెట్టి కుడ్య చిత్రాన్ని ఆవిష్కరించానని క్యాప్షన్లో రాసుకొచ్చాడు. కుడ్య చిత్రంలో ఓ వ్యక్తి గ్లాస్లో వేడి వేడి ఫిల్టర్ కాఫీ పోస్తుండటం కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్లో అరటి ఆకులో ఇడ్లీ, ఊతప్పం, మేదు వడ, పొడి మసాలా ఇతర స్ధానిక ఆహార పదార్ధాలు చూడొచ్చు.
ఇదే ఆకులో మరోవైపు క్రిస్పీ దోశ, వైట్, రెడ్ చట్నీ ఉంటాయి. కుడ్య చిత్రం కింది భాగంలో వీధి వ్యాపారి అటుగా వెళుతుండటం కనిపిస్తుంది. అతడి క్రియేటివిటీని పలువురు ఇన్స్టాగ్రాం యూజర్లు ప్రశంసించారు. సో బ్యూటిఫుల్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, నోరూరించేలా ఉందని, అద్భుతమని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు. శ్రామికుల ప్రేమ ఫలితమని మరో యూజర్ కామెంట్ చేశారు. మీరు ప్రపంచమంతా తిరిగి వారి వీధుల్లో మీ అద్భుతమైన పెయింటింగ్స్ షేర్ చేస్తుంటారని భావిస్తున్నానని మరొక యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Vitamin-D | 90% మంది మహిళల్లో విటమిన్-డీ లోపం.. అపోలో, హార్లిక్స్ అధ్యయనంలో వెల్లడి