Siddaramaiah : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ విజయం అనంతరం కర్నాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పంందించారు.
ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)ను ఆయన బుధవారం ఆదేశించారు. నసీర్ హుస్సేన్ విజయం సాధించారని ప్రకటించిన వెంటనే కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారని బీజేపీ మంగళవారం ఆరోపించింది.
అయితే తమ పార్టీ నేతలు హుస్సేన్కు అనుకూలంగా నినాదాలు చేశారని, కాషాయ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించలేదని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ దీనిపై ఎఫ్ఎస్ఎల్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
Read More :
Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హంతకుడు గుండెపోటుతో మృతి