న్యూఢిల్లీ: ఈవీఎం చిట్టా(లాగ్స్)లను కనీసం 2-3 ఏండ్ల పాటు భద్రపరచాలని, ప్రతి దశ ఓటింగ్ తర్వాత కౌంటింగ్ లోపు ఆయా దశల పోలింగ్ రికార్డులను వెల్లడించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కోరారు. ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. తద్వారా ఏ ఎంపీ ‘చట్టవిరుద్ధంగా’ ఎన్నిక కాలేరన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.
‘ఫామ్ 17సిని ఈసీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోతే ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో ప్రజలకు తెలియదు. ఫలితాలు వెలువడి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరూ ఏమీ చేయలేరు’ అని సిబల్ అన్నారు. ఓటింగ్ శాతం ఎలా పెరిగిందో, గణాంకాలను సవరించినప్పుడు అదెలా పెరుగుతుందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు.