న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసును మరువక ముందే రాజస్థాన్లోని నాగౌర్లో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. పెండ్లి చేసుకొమ్మని బలవంతం చేసిందన్న కోపంతో గుడ్డీ అనే యువతిని దారుణంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు ఓ వ్యక్తి. వాటిలో కొన్ని భాగాలు మాల్వా రోడ్లో లభించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనూప్రామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసినట్టు ఒప్పుకొన్నాడు.