జైపూర్/చండీగఢ్: రాజస్థాన్లో మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కఠారియా, మాజీ ఎమ్మెల్యేలు రిచ్పాల్ మీర్దా, విజయ్పాల్ మీర్దా సహా పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ఆదివారం బీజేపీలో చేరారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
రైతుల పేరిట ఓట్లడుగుతూ కాంగ్రెస్ వారిని మోసం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మరోవైపు, హర్యానాలోని హిస్సార్ బీజేపీ ఎంపీ బిజేంద్ర సింగ్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఎంపీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని ఆయన చెప్పారు.