భోపాల్ : కాంగ్రెస్ అధ్యక్షుడు లేని పార్టీ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. పార్టీలో ఎలాంటి పదవిలో లేని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రులను మార్చడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడని చురకలు వేశారు. అధ్యక్షుడు అంటూ లేని పార్టీని ప్రపంచంలో ఎక్కడైనా చూశారా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
సోనియా గాంధీ కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమేనని అన్నారు. పంజాబ్ ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తుంటే ఎందుకు నాయకత్వ మార్పు చేపట్టారని అన్నారు. మరోవైపు సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. తాను పూర్తికాల అధ్యక్షురాలినేనని ఆమె స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.