భోపాల్ : రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 29 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా మిషన్ 29 (Mission 2024) నినాదంతో ముందుకెళతామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. చింద్వారాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ కాషాయ పార్టీ కైవసం చేసుకునేలా రాత్రింబవళ్లూ కష్టపడతామని చెప్పారు.
లాడ్లీ బెహనా పధకం తర్వాత లాఖ్పతి బెహనా పధకానికి శ్రీకారం చుడతామని చెప్పారు. నా చెల్లెళ్ల కోసం ఈ హామీని నెరవేరుస్తానని అన్నారు. మహిళలు నెలకు రూ. 10,000 ఆర్జించేలా వారికి స్వయం సమృద్ధి కల్పిస్తామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీక దక్కిన అద్భుత విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం ఇస్తున్నానని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీ ఘనవిజయం సాధించిన అనంతరం శివరాజ్ చౌహాన్ తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
నవంబర్ 17న మధ్యప్రదేశ్లోని 230 స్ధానాలకు ఎన్నికలు జరగ్గా ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో పాలక బీజేపీ ఏకంగా 163 స్దానాల్లో గెలుపొంది అధికారాన్ని నిలుపుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 66 సీట్లలో గెలుపొంది ప్రతిపక్షానికి పరిమితమైంది. భారత్ ఆదివాసీ పార్టీ ఒక స్ధానంలో విజయం సాధించింది.
Read More :