Sanjay Raut | ముంబై, సెప్టెంబర్ 24: మూఢ నమ్మకాలను అనుసరిస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను తూలనాడే ప్రధాని మోదీ అదే మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. మన శాస్త్రవేత్తలు చంద్రుడిని చేరుకుంటే.. మోదీ మాత్రం ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారని మండిపడ్డారు.
‘ప్రస్తుతమున్న పాత పార్లమెంట్ భవనం పదేండ్ల తర్వాత మోదీకి కలిసిరాదని, అందులో ఎవరూ పదేండ్లకు మించి అధికారంలో కొనసాగలేరని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. నూతన పార్లమెంట్ భవనం గోముఖ రూపంలో ఉండాలన్న ఆ జ్యోతిష్యుడి సలహా మేరకే కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం జరిగింది’ అని రౌత్ పేర్కొన్నారు.