Shashi Tharoor | కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశం పేరును ‘ఇండియా’ (India) నుంచి ‘భారత్’ (Bharat)గా మారుస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ అంశం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాగా, విపక్ష కూటమి ‘ఇండియా’ అని పేరు పేట్టుకోవడం వల్లనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పేరును ‘భారత్’గా మార్చాలనుకుంటోందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) స్పందించారు. ఈ మేరకు విపక్ష కూటమికి కీలక సూచన చేశారు.
‘విపక్షాలు తమ కూటమికి ‘భారత్’ అని పేరు పెట్టుకోవాలి. అప్పుడే అధికార పక్షం పేర్లు మార్చే వికృత క్రీడను ఆపేసే అవకాశం ఉంది. అందుకే ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు బదులు ‘భారత్’ అని అర్థం వచ్చే పేరు పెట్టుకోవాలి. భారత్ అంటే.. అలయన్స్ ఫర్ బెటర్మెంట్, హర్మనీ అండ్ రెస్పాన్సిబుల్ అడ్వాన్స్మెంట్ ఫర్ టుమారో’’ అని ఆయన వివరించారు.
Also Read..
Indias Name Change Row | ఇండియా పేరు మార్పుపై స్పందించిన ఐక్యరాజ్య సమితి.. ఏమందంటే..?
Covid 19 Treatment | కరోనా ట్రీట్మెంట్తో నీలిరంగులోకి మారిన 6 నెలల పసికందు కళ్లు
Jailer Movie OTT | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్’.. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏదంటే