Loksabha Elections 2024 : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై బీజేపీ ఎన్నికల కోసం డ్రామా ఆడుతోందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. పీఓకేపై పదేండ్ల పాటు వారు ఏం చేశారని ఆయన నిలదీశారు. పీఓకేను స్వాధీనం చేసుకుంటామని కాషాయ నేతలు సాగిస్తున్న ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్నాలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
పదేండ్లుగా బీజేపీ ఇదే తీరున వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వేధింపుల కేసును ప్రస్తావిస్తూ న్యాయస్ధానాల పరిధిలో ఉన్న అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. స్వాతి మలివాల్పై జరిగిన దాడి విషయంలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు, అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని శశి థరూర్ ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలను కాషాయ పార్టీ విస్మరిస్తోందని, సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు భావోద్వేగపరమైన అంశాలను లేవనెత్తుతోందని విమర్శించారు.
Read More :
Konatham Dileep | కేసులకు బెదిరేది లేదు.. సీఎం రేవంత్కు కొణతం దిలీప్ స్ట్రాంగ్ వార్నింగ్