ముంబై, మార్చి 29: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు గాల్ బ్లాడర్కు (పిత్తాశయానికి) సంబంధించిన శస్త్రచికిత్స చేయనున్నారు. పవార్ ఆదివారం సాయంత్రం పొత్తికడుపులో నొప్పితో బాధపడటంతో ముంబై బ్రీచ్ కాండీ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఎన్సీపీకి చెందిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం ట్విట్టర్లో తెలిపారు. పిత్తాశయ సమస్యతో పవార్ బాధపడుతున్నారని, ఆయనకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి మందులిచ్చి పంపారని, పవార్ బుధవారం తిరిగి దవాఖానాలో చేరుతారని, ఆ రోజు వైద్యులు ఎండోస్కోపీ, శస్త్రచికిత్స నిర్వహించనున్నారని వివరించారు.
ఇవీ కూడా చదవండి..
ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి: హర్దీప్ సింగ్
విజయన్ రాజ్యాంగానికి అతీతుడు కాదు : కేరళ బీజేపీ చీఫ్