Sharad Pawar | ప్రతి రోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు యోగి సర్కార్కు షాక్ ఇస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ‘ బీజేపీ నేతలు పార్టీని వీడని రోజు లేదు (ఉండదు). ఉదాహరణకు యూపీని చూడండి. అక్కడ 13 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలే చేరేందుకు.. బీజేపీని వీడారు. మరో నలుగురు ఈ రోజే గుడ్బై చెబుతున్నారని కూడా నాకు తెలిసింది’ అంటూ శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
ప్రతి రోజూ బీజేపీకి షాక్ తగులుతూనే వుంది. కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య నుంచి ప్రారంభిస్తే.. ఇద్దరు మంత్రులు ఇప్పటికీ గుడ్ బై చెప్పేశారు. స్వామి మౌర్య తర్వాత ధరం సింగ్, తాజాగా ఆయుశ్ మంత్రి ధరంసింగ్ సైనీ కూడా పార్టీని వీడారు. దీంతో ముగ్గురు మంత్రులు పార్టీని వీడినట్లైంది. ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో బీజేపీలో గుబులు మొదలైంది.
ప్రతి రోజూ ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే రాజీనామా చేస్తూనే వుంటారని ధరంసింగ్ సైనీ సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 20 వరకూ రాజీనామాల పరంపర కొనసాగుతూనే వుంటుందని ప్రకటించారు. ఐదేళ్లుగా దళితులు, అణగారిన వర్గాల వారిని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా అణచివేసిందని, వారి గొంతు నొక్కారని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ధరంసింగ్ సైనీ పేర్కొన్నారు.