న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ ఉదంతం, వివాదాస్పద వ్యవసాయ బిల్లుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు కాంగ్రెస్ మినహా ఎనిమిది విపక్ష పార్టీలు లేఖ రాశాయి. రాజ్యాంగ విలువలు, ప్రతిష్టను ఇనుమడించేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాయి. శిరోమణి అకాలీదళ్, ఎన్సీపీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ, జేకేఎన్సీ, సీపీఎంలు రాష్ట్రపతికి లేఖ రాశాయి.
పెగాసస్ ఉదంతంతో పాటు వ్యవసాయ చట్టాల ఉపసంహరణను కోరుతూ తమ వాదన వినిపించేందుకు సమయం కేటాయించాలని విపక్షాలు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఈ రెండు అంశాలను చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విపక్షాలు రాష్ర్టపతిని కోరాయి. రాజ్యాంగం, పార్లమెంటరీ నియమాలు విధానాలను పరిరక్షించేలా చొరవ చూపాలని కోరుతూ విపక్షాలు రాష్ట్రపతికి లేఖ రాశాయని ఎన్సీపీ నేత సుప్రియా సూలే తెలిపారు.