న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీలు (Rajasthan Polls) ప్రచార వ్యూహాలకు పదునుపెట్టడం, అభ్యర్ధుల ఎంపిక కసరత్తును వేగవంతం చేస్తున్నాయి. ఇక రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సోమవారం అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది.
41 మంది అభ్యర్ధులతో కూడిన ఈ జాబితాలో ఏడుగురు ఎంపీలకు చోటు కల్పించారు. అయితే ఈ జాబితాలో మాజీ సీఎం వసుంధర రాజే అనుయాయుల పేర్లు కనిపించలేదు. ఇక జాబితాలో ఎంపీలు రాజ్యవర్ధన్ రాధోడ్, దియా కుమార్, బాబా బాలకాంత్, నరేంద్ర కుమార్, భగీరధ్ చౌధరి, కిరోడి లాల్ మీనా, దేవిజ్ పటేల్ల పేర్లున్నాయి.
విజయరాజె సింధియా అనుయాయులుగా పేరొందిన ఎమ్మెల్యే నర్పత్ సింగ్ రాజ్వీ, రాజ్పాల్ సింగ్ షెకావత్లకు తొలి జాబితాలో స్ధానం లభించలేదు. రాజస్ధాన్లో నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
IIT Kanpur | ఐఐటీ కాన్పూర్లో రెండు జట్ల మధ్య ఘర్షణ.. కుర్చీలతో కొట్టుకున్న ఆటగాళ్లు.. VIDEO