Accident in Karnataka | కర్ణాటకలోని బెళగావి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఇంకా మరో 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
గోకాక్ తాలుకా అక్కతంగియారహళ్ల గ్రామస్తులు బెళగావి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఏడుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలను కోల్పోయారు.మరో 11 మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీప దవాఖానకు తరలించారు.
క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. బాధితులను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. పని విషయమై బెళగావికి వెళుతున్నప్పుడు.. వారు వెళుతున్న వాహనం డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.